సీపీఎస్ బకాయిలు ఇప్పించండి
ABN , Publish Date - Apr 27 , 2024 | 04:07 AM
సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ బకాయిలు, సీపీఎస్ కంట్రిబ్యూషన్ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే ఇప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ విన్నవించింది.
అమరావతి, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ బకాయిలు, సీపీఎస్ కంట్రిబ్యూషన్ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే ఇప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ విన్నవించింది. ఎన్నికల కోడ్ వచ్చినా బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని, కనుక ఇచ్చిన మాట ప్రకారం బకాయిలు చెల్లించాలని కోరారు. శుక్రవారం ఈ మేరకు అమరావతి సచివాలయంలో ఆ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కోట్ల రాజేష్, అంబటి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు నాపా ప్రసాద్ సీఎ్సను కలిసి వినతిపత్రం అందజేశారు. సీపీఎస్ ఉద్యోగులకు మూడేళ్లుగా 60 నెలల డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఆ తర్వాత ఇచ్చిన డీఏలకు సంబంధించిన బకాయిల చెల్లింపులూ జరగలేదని తెలిపారు.