Share News

జగన్‌ పత్రికపైపోలీసులకు ఫిర్యాదు

ABN , Publish Date - Oct 11 , 2024 | 04:01 AM

జగన్‌ పత్రికలో వచ్చిన కథనాలపై టీడీపీ స్టేట్‌ లీగల్‌ సెల్‌ జనరల్‌ సెక్రటరీ గూడపాటి లక్ష్మీనారాయణ పటమట పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.

జగన్‌ పత్రికపైపోలీసులకు ఫిర్యాదు

విజయవాడ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): జగన్‌ పత్రికలో వచ్చిన కథనాలపై టీడీపీ స్టేట్‌ లీగల్‌ సెల్‌ జనరల్‌ సెక్రటరీ గూడపాటి లక్ష్మీనారాయణ పటమట పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. ఆ పత్రికలో ప్రచురితమైన కథనాలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అల్లర్లను ప్రేరేపించేలా ఉంటున్నాయని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో వైసీపీ నేతలు అల్లర్లకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌ పత్రికలో అడ్డగోలుగా కథనాలు రాసి ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. ఈ నెల ఎనిమిదో తేదీన ప్రచురితమైన కథనాలన్నీ అవాస్తవాలని ఫిర్యాదు చేశారు.

Updated Date - Oct 11 , 2024 | 04:01 AM