ఓపీ సమయం పెంపుకై వినతి
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:02 AM
వర్షాలు కురుస్తున్న కారణంగా సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న రోగుల సంఖ్య ఎక్కువగా ఉంది.
ఆదోని టౌన్, జూన్ 11: వర్షాలు కురుస్తున్న కారణంగా సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న రోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ చేసే సమయం తక్కువగా ఉండటంతో రోగులు ఇబ్బందులను పడుతున్నారని ప్రభుత్వ ఆసుపత్రుల అడ్వైజరీ కమిటీ సభ్యుడు నసీరుద్దీన్ పటేల్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఓపీ చూసే సమయం ఉదయం 9 నుంచి 12 వరకు మాత్రమే కాకుండా, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సమయాన్ని పొడగించాలని కోరినట్లు తెలిపారు. డివిజన్లోని అనేక గ్రామాల నుంచి వచ్చే రోగలందరికీ వైద్య సేవలు అందేలా చూడాలని కోరారు. ప్రతిరోజూ ప్రభుత్వ ఆసుపత్రికి 400 నుంచి 500 మంది దాకా రోగులు వస్తున్నారని, ఓపీ సమయం తక్కువగా ఉండటంతో అందరికీ వైద్య సేవలు అందడం లేదని పేర్కొన్నారు.