రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Jul 26 , 2024 | 11:58 PM
రెవె న్యూ సిబ్బంది భూ సంబంధిత విషయాలలో అప్రమత్తంగా ఉం టూ బాధ్యతగా పనిచేయాలని తహసీల్దార్ శ్రీనివాసులు సూచిం చారు.
రామసముద్రం, జూలై 26: రెవె న్యూ సిబ్బంది భూ సంబంధిత విషయాలలో అప్రమత్తంగా ఉం టూ బాధ్యతగా పనిచేయాలని తహసీల్దార్ శ్రీనివాసులు సూచిం చారు. స్థానిక తహసీల్దార్ కార్యాల యంలో శుక్రవారం డీటీ, వీఆర్వో లు, ఆర్ఐ, సర్వేయర్లతో తహసీ ల్దార్ సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ డీకేటీ, పట్టాభూమి తదితర దస్త్రాలను జాగ్రత్తగా భద్రపరుచు కోవాలని తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం విమర్శలకు తావు లేకుండా పనిచే యాలన్నారు. కార్యాలయానికి వచ్చే ప్రతి దరఖాస్తును ఆనలైన చేయించా లన్నారు. సమావేశంలో, డీటీ శ్రీనివాసరావు, ఆర్ఐ నాగరాజు, సీనియర్ అసిస్టెంట్ రెడ్డెప్ప, వీఆర్వోలు భార్గవి, రెహ్మాన, రఘు రామ్, జగధీష్, శ్రీని వాసులు, అశ్వని, తదితరులు పాల్గొన్నారు.
ఫ్రీహోల్డ్ భూములను పరిశీలించి నివేదిక ఇవ్వండి
ములకలచెరువు, జూలై 26: ఫ్రీహోల్డ్ భూములను పునఃపరిశీ లించి నివేదికలు ఇవ్వాలని తహసీ ల్దార్ అనీల్కుమార్ ఆదేశించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం జరిగిన వీఆర్వోల సమావేశంలో ఆయన మాట్లాడు తూ పునఃపరిశీలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కార్యాలయంలో రికార్డులు, పత్రాలను భద్రంగా ఉంచాలన్నారు. రికార్డుల భద్రతపై నిర్ణక్ష్యం వహిస్తే చర్యలు తప్పవ న్నారు. ఈ సమావేశంలో డీటీలు హరికుమార్, లక్ష్మి, ఆర్ఐ వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.