మచిలీపట్నంలో సత్యా 22వ షోరూం ప్రారంభం
ABN , Publish Date - May 30 , 2024 | 01:58 AM
వినియోగదారులకు సరసమైన ధరలకు నాణ్యమైన గృహోపకరణాలు
సరసమైన ధరలో నాణ్యమైన గృహోపకరణాలే లక్ష్యం: ఎండీ జాక్సన్
మచిలీపట్నం టౌన్, మే 29: వినియోగదారులకు సరసమైన ధరలకు నాణ్యమైన గృహోపకరణాలు, ఇతర పరికరాలు అందించడమే సత్యా లక్ష్యమని ఆ సంస్థ ఎండీ జాక్సన్ అన్నారు. మచిలీపట్నం మెయిన్రోడ్డులోని రాజాగారి సెంటర్లో సత్యా 22వ షోరూంను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే తమ 21 శాఖలు లక్షలాది వినియోగదారుల ఆదరణ పొందుతున్నాయన్నారు. మచిలీపట్నంలో మూడంతస్తుల విశాల భవనంలో వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా ఎలక్ర్టానిక్ పరికరాలు సరసమైన ధరలకు విక్రయిస్తున్నామన్నారు. సెల్ఫోన్లు, ఫ్రిజ్లు, ఏసీలు, స్టౌలు, వాషింగ్ మెషీన్లు, ప్రెషర్ కుక్కర్లు, గ్రైండర్లు, ఐరన్ బాక్సులు, నాన్స్టిక్ కిచెన్ వస్తువులు, ఫోర్బర్నర్ గ్యాస్ స్టౌలు, స్మార్ట్ వాచ్లు అందుబాటులో ఉంచామన్నారు. రూ. 7990కే ఎల్ఈడీ టీవి అందిస్తున్నామన్నారు. రూ. 20 వేల విలువైన వస్తువులు కొన్న వారికి గోల్డ్ కాయిన్ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. సత్యా అంటేనే వినియోగదారులకు సంతోషమన్నారు. కార్యక్రమంలో డీజీఎం ఆనంద్కుమార్, ఏజీఎం కిరణ్, షాపు ఇన్ఛార్జి జిలానీ తదితరులు పాల్గొన్నారు.