గ్రూప్-2 మెయిన్స్కు ఎంపిక నిష్పత్తి పెంచాలి
ABN , Publish Date - Feb 28 , 2024 | 03:18 AM
గ్రూప్-2 ప్రశ్నపత్రం అత్యంత కఠినంగా ఇచ్చినందున మెయిన్స్కు ఎంపికచేసే అభ్యర్థుల నిష్పత్తిని 1:100కు పెంచాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్
అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): గ్రూప్-2 ప్రశ్నపత్రం అత్యంత కఠినంగా ఇచ్చినందున మెయిన్స్కు ఎంపికచేసే అభ్యర్థుల నిష్పత్తిని 1:100కు పెంచాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. సిలబస్ పరిధి దాటి ప్రశ్నలు ఇచ్చారని, గ్రామీణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. సామాజిక శాస్త్రం, గణితం ప్రశ్నలు చదవడానికే ఎక్కువ సమయం పట్టిందని, స్థాయికి మించిన ప్రశ్నలు ఇచ్చి నిరుద్యోగులను ఆందోళనకు గురిచేశారని ఆక్షేపించారు.