Share News

అమరావతికి మారనున్న షర్మిల మకాం!

ABN , Publish Date - Oct 22 , 2024 | 03:48 AM

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి ఇకపై అమరావతి కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు సాగించాలని నిర్ణయించారు.

అమరావతికి మారనున్న షర్మిల మకాం!

అమరావతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి ఇకపై అమరావతి కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు సాగించాలని నిర్ణయించారు. ఉండవల్లి సమీపంలో అనువైన స్థలం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కృష్ణా నది ఒడ్డున మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం సమీపంలో స్థలాలను ఇటీవల ఆమె పరిశీలించారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యేలోపు నివాసం ఉండేందుకు ఏదైనా భవనాన్ని అద్దెకు తీసుకోవాలని భావిస్తున్నారు.

Updated Date - Oct 22 , 2024 | 03:48 AM