ముత్యపు పందిరి వాహనంపై శ్రీనివాసుడు
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:13 AM
తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లెలో కొలు వైన ప్రసన్న వేంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా వేంకటరమణ స్వామి వారు శ్రీదేవి, భూదేవీలతో కలిసి ముత్యపుపం దిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు
తంబళ్లపల్లె, ఫిబ్రవరి 12: తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లెలో కొలు వైన ప్రసన్న వేంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా వేంకటరమణ స్వామి వారు శ్రీదేవి, భూదేవీలతో కలిసి ముత్యపుపం దిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు టీటీడీ ఆధ్వర్యంలో అం గరంగ వైభవంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజైన సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వేంకటరమణ స్వామి ఉదయం ముత్య పు పందిరి వాహనం, రాత్రి సింహ వాహనంపై నుంచి భక్తులను కటా క్షించారు. వేదపండితులు సోమవారం వేకువజామునే స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలు పూర్తిచేశారు. అనంతరం 8 గంటల నుంచి శ్రీదేవి భూదేవి సమేత వేంకటరమణ స్వామి వారు ముత్యపు పందిరి వాహనంపై కొలువుదీరి విశేష పూజలందుకున్నాడు. అనంతరం భక్తుల గోవిందనామస్మరణల నడుమ ఆలయ మాడ వీధు ల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. రాత్రి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సింహ వాహనంపై ఆసీనులై పూజలందుకుని అనంతరం ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతున్న దేవదేవుడికి భక్తులు కర్ఫుర నీరాజనాలు పలికారు.
భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని వాహన సేవల్లో పాల్గొన్నారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో బాగంగా వెంకన్నకు మంగళవారం ఉదయం కల్పవృక్షవాహనము, రాత్రికి హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కార్యక్ర మంలో ఆలయ సూపరింటెండ్ మునిచెంగల్రాయులు, ఆలయ ఇనస్పెక్టర్ దిశంత కుమార్, ఉప ప్రఽధాన అర్చకులు కృష్ణప్రసాద్ భట్టర్, సిబ్బంది నగేష్, భక్తులు పాల్గొన్నారు.