మంత్రి కార్యక్రమానికి రాకపోతే ఆసరా కట్
ABN , Publish Date - Feb 12 , 2024 | 02:36 AM
శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి హాజరు కాకుంటే డ్వాక్రా సభ్యులకు వైఎ్సఆర్ ఆసరా నగదు పెండింగ్ పెడతామని యానిమేటర్..
డ్వాక్రా సభ్యులకు యానిమేటర్ హుకుం.. ఆడియో వైరల్
పెనుకొండ టౌన్, ఫిబ్రవరి 11: శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి హాజరు కాకుంటే డ్వాక్రా సభ్యులకు వైఎ్సఆర్ ఆసరా నగదు పెండింగ్ పెడతామని యానిమేటర్.. పెట్టిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. సోమందేపల్లిలోని హైస్కూల్లో ఆదివారం వైఎ్సఆర్ ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో సోమందేపల్లికి చెందిన పార్వతి అనే యానిమేటర్.. మహిళా సంఘాల గ్రూపులో ఓ ఆడియో పోస్టు చేసింది. ‘నేను పార్వతిని మాట్లాడుతున్నా. వైఎస్సార్ ఆసరా పడే ప్రతి సభ్యురాలు కచ్చితంగా (మంత్రి) సమావేశానికి రావాలి. మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి కూర్చోండి. ప్రతి మెంబర్ హాజరు కావాలి. అలా హాజరైన మెంబర్కే ఆసరా నగదు డ్రా చేసి ఇస్తారు. లేదంటే అధికారులు పెండింగ్ పెడతారు. సంఘానికి ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపరులో అందరూ తప్పక సంతకం చేయాలి’ అంటూ పేర్కొన్నారు.