జగన్ తాటాకుచప్పుళ్లకు టీడీపీ భయపడదు : కోట్ల
ABN , Publish Date - Jul 09 , 2024 | 12:58 AM
జగన్ తాటాకుచప్పుళ్లకు టీడీపీ భయపడదని డోన్ఎమ్మెల్యే కోట్లసూర్యప్రకాష్రెడ్డి అన్నారు.
పత్తికొండ, జూలై8: జగన్ తాటాకుచప్పుళ్లకు టీడీపీ భయపడదని డోన్ఎమ్మెల్యే కోట్లసూర్యప్రకాష్రెడ్డి అన్నారు. సోమవారం పత్తికొండలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ప్రమోద్కుమార్రెడ్డి ఇంట్లో ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. రాజశేఖర్రెడ్డిలాగే జగన్ మంచిచేస్తాడని, నమ్మిప్రజలు ముఖ్యమంత్రిని చేశారని అన్నారు. ఐదేళ్ల జగన్ దుర్మార్గపాలనతో రాజశేఖర్రెడ్డికి జగన్కు తేడాను ప్రజలు గుర్తించారని, భవిష్యత్లో ప్రజలు జగన్ను నమ్మేపరిస్థితేలేదని స్పష్టం చేశారు. సుమారు 70వేల మందిపై జగన్ అక్రమకేసులు భనాయించి గుండాలతో, రౌడీలతో దాడులు చేయించాడని, ఇప్పుడు నీతులుచెబుతున్నాడని ఎద్దేవాచేశారు. 2029 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని, ఈ సారి జగన్ పులివెందులలో కూడా ఓటమి కావడం తథ్యమని జోస్యం చెప్పారు. ప్రజల వద్దకువెళ్లి వారి సమస్యలు తెలుసుకొని అభివృద్ధి కోసం ముందుకు సాగడమే టీడీపీ లక్ష్యమన్నారు. టీడీపీ నాయకులు ప్రబాకర్రెడ్డి,శ్రీధర్రెడ్డి ఉన్నారు.