అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
ABN , Publish Date - Jan 17 , 2024 | 02:50 AM
అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. ఉన్నత చదువుల కోసం 17 రోజుల క్రితమే అమెరికాకు వెళ్లిన పాలకొండ విద్యార్థితోపాటు తెలంగాణకు చెందిన మరో విద్యార్థి కూడా అక్కడ గ్యాస్ లీక్ కావడంతో నిద్రలోనే దుర్మరణం పాలయ్యారు.
గదిలో గ్యాస్ లీక్ కావడంతో నిద్రలోనే దుర్మరణం
ఒకరు పాలకొండ వాసి.. మరొకరు తెలంగాణ విద్యార్థి
పాలకొండ: అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. ఉన్నత చదువుల కోసం 17 రోజుల క్రితమే అమెరికాకు వెళ్లిన పాలకొండ విద్యార్థితోపాటు తెలంగాణకు చెందిన మరో విద్యార్థి కూడా అక్కడ గ్యాస్ లీక్ కావడంతో నిద్రలోనే దుర్మరణం పాలయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చెందిన రాకోటి వెంకటరమణ, ఆదిలక్ష్మిల కుమారుడు రాకోటి సాయి నికేశ్ (21) తాడేపల్లి గూడెంలో బీటెక్ పూర్తిచేశారు. అమెరికాలోని హార్డ్ఫోర్డ్ సిటీలో సేక్రెడ్ హార్ట్ వర్సిటీలో మాస్టర్స్ చేసేందుకు 17 రోజుల క్రితమే అక్కడకు వెళ్లారు. అక్కడ మరో ఇద్దరు తెలుగువారితో కలిసి ఓ అపార్ట్మెంట్లో ఉంటూ.. చదు వుకొంటున్నారు. ఈ క్రమంలో రూమ్లో ఉంటున్న గుంటూరు విద్యార్థి.. సోమవారం రాత్రి వేరే ఫ్రెంఢ్ రూమ్కు వెళ్లగా.. సాయినికేశ్, తెలంగాణలోని మహబూబ్నగర్కు చెందిన మరో విద్యార్థి కలిసి ఒక రూమ్లో నిద్రపోయారు. అయితే రూమ్లో లిక్విడ్ గ్యాస్ లీకవడంతో వారిద్దరూ అపస్మారక స్థితిలోకి చేరుకొన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు గుంటూరుకు చెందిన విద్యార్థి రూమ్కు వచ్చి చూడగా ఇద్దరూ విగతజీవులుగా పడిఉన్నారు.