టీడీపీతోనే మహిళా సాధికారత
ABN , Publish Date - May 02 , 2024 | 05:16 AM
తెలుగుదేశం పార్టీతోనే మహిళా సాధికారత సాధ్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి అన్నారు. ఈ ఎన్నికల్లో ‘స్త్రీశక్తి’ సత్తా ఏమిటో చూపించాలని కోరారు.
ఈ ఎన్నికల్లో ‘స్త్రీశక్తి’ని చూపించండి: బ్రాహ్మణి
హిందూపురం, మే 1: తెలుగుదేశం పార్టీతోనే మహిళా సాధికారత సాధ్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి అన్నారు. ఈ ఎన్నికల్లో ‘స్త్రీశక్తి’ సత్తా ఏమిటో చూపించాలని కోరారు.
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని జేవీఎస్ ఫంక్షన్ హాల్లో బుధవారం స్ర్తీశక్తి మహిళా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధరాదేవి, నారా బ్రాహ్మణి, తేజశ్విని హాజరయ్యారు.
ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ.. మహిళల కోసం ఎన్టీఆర్ ఎన్నో విప్లవాత్మక పథకాలు తీసుకొచ్చారన్నారని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు మహిళలకు స్థానికసంస్థల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు.
టీడీపీ హయాంలో మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందాయన్నారు. చంద్రబాబు ప్రారంభించిన డ్వాక్రా సంఘం నేడు విస్తరించిందన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్సిక్స్ పథకాలు కూడా మహిళలకు అండగా నిలుస్తాయన్నారు. ప్రతిఒక్కరూ ఆలోచించి అభివృద్ధి చేసే చంద్రబాబుకు ఓటేయాలని సూచించారు.