తండాల అభివృద్ధికి కృషి: కందికుంట
ABN , Publish Date - Apr 14 , 2024 | 12:27 AM
తనకల్లు/ నల్లచెరువు/ గాండ్లపెంట, ఏప్రిల్ 13: కూ టమి అధికారంలోకి రాగానే గిరిజన తండాల అభివృద్ధికి కృషి చే స్తానని కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు.
తనకల్లు/ నల్లచెరువు/ గాండ్లపెంట, ఏప్రిల్ 13: కూ టమి అధికారంలోకి రాగానే గిరిజన తండాల అభివృద్ధికి కృషి చే స్తానని కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. కదిరి పట్టణంలోని పీవీఆర్ గ్రాండ్ ఫంక్షనహాల్లో శనివారం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గిరిజనుల స మావేశం జరిగింది. ఇందులో కందికుంట పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలోని గిరిజన తండాల్లో గల యువత నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతోనే గిరిజనులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత టీడీపీదే అన్నారు. తండాల అభివృద్ధికోసం గిరిజనులు కలిసి కట్టుగా పని చేయాలని చెప్పారు. కూటమి అధికారంలోకి రాగానే తండాల అభివృద్ధిపై ప్రత్యేక కృషి చేస్తానని పేర్కొన్నా రు. వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుపే ధ్యేయంగా గిరిజన యువత పని చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పవనకుమార్రెడ్డి, శ్రీరాములనాయక్, ఉత్తన్ననాయక్, సర్పంచ కాంతమ్మ, కాలేనాయ క్, వివిధ మండలాల గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అలరించిన గిరిజన నృత్యం
సమావేశం ప్రారంభమయ్యేంతవరకు గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలు చేసి అలరించారు. వేల సంఖ్యలో వచ్చిన గిరిజనులు ఆనందంతో కేరింతలు కొడుతూ నృత్యంలో పాలుపంచుకున్నారు.