శిలాఫలకాలకూ వైసీపీ రంగు!
ABN , Publish Date - Mar 14 , 2024 | 04:32 AM
ఇలాంటి శిలాఫలకాన్ని ఎక్కడైనా చూశారా? ఎవరికీ తట్టని, ఊహకే అందని ఆలోచనలు వైసీపీ నేతలకు వస్తున్నాయి. విశాఖను తామే సుందరంగా మారుస్తున్నామనే స్థాయిలో వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ కోవలోనే శిలాఫలకాలను పార్టీ జెండా దిమ్మలను మించిపోయేలా
మురళీనగర్ (విశాఖపట్నం), మార్చి 13: ఇలాంటి శిలాఫలకాన్ని ఎక్కడైనా చూశారా? ఎవరికీ తట్టని, ఊహకే అందని ఆలోచనలు వైసీపీ నేతలకు వస్తున్నాయి. విశాఖను తామే సుందరంగా మారుస్తున్నామనే స్థాయిలో వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ కోవలోనే శిలాఫలకాలను పార్టీ జెండా దిమ్మలను మించిపోయేలా తీర్చిదిద్దుతున్నారు. ఉత్తర నియోజకవర్గ పరిధిలోని జీవీఎంసీ 51వ వార్డులో గల ఆర్అండ్బీ జంక్షన్ మర్రిపాలెం ఉడా కాలనీ ప్రవేశ మార్గం వద్ద ఇలాంటి శిలాఫలకం ఒకటి దర్శనమిస్తోంది. ఇటీవల ఈ రోడ్డు మధ్యనున్న డివైడర్ వెడల్పును (కేవలం 400 మీటర్ల మేర) కుదించే పనులు చేపట్టారు. ఇవి పూర్తై సుమారు ఐదు నెలలు దాటగా, తాజాగా ఇక్కడ శిలాఫలకాన్ని ఏర్పాటుచేశారు. దానిపై వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ ముద్రించారు. చిత్రమేమిటంటే ఈ రోడ్డులోని పాత డివైడర్ను తొలగించిన సందర్భంలో పచ్చని చెట్లను నరికేశారు. తాజాగా నిర్మించిన డివైడర్ చెత్తతో నిండిపోయింది.