Share News

8 ఐపీఓలు.. 8 లిస్టింగ్‌లు

ABN , Publish Date - Jul 22 , 2024 | 06:01 AM

ప్రైమరీ మార్కెట్లో ఈ వారం చాలా సందడి ఏర్పడనుంది. మొత్తం 8 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలు (ఐపీఓ) జారీ చేయనుండగా మరో 8 కంపెనీలు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌ కానున్నాయి. ఇవన్నీ ఎస్‌ఎంఈ విభాగంలోనివే కావడం విశేషం...

8 ఐపీఓలు.. 8 లిస్టింగ్‌లు

ఈ వారం ప్రైమరీ మార్కెట్‌ బిజీ బిజీ

న్యూఢిల్లీ: ప్రైమరీ మార్కెట్లో ఈ వారం చాలా సందడి ఏర్పడనుంది. మొత్తం 8 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలు (ఐపీఓ) జారీ చేయనుండగా మరో 8 కంపెనీలు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌ కానున్నాయి. ఇవన్నీ ఎస్‌ఎంఈ విభాగంలోనివే కావడం విశేషం. పబ్లిక్‌ ఇష్యూకి వస్తున్న 8 కంపెనీలు రూ.410 కోట్ల సమీకరణ లక్ష్యం పెట్టుకున్నాయి. వాటిలో ఎస్‌ఏఆర్‌ టెక్నాలజీస్‌ జారీ చేస్తున్న రూ.150 కోట్ల ఫాలో ఆన్‌ ఇష్యూ (ఎఫ్‌పీఓ) కూడా ఉంది.

లిస్టింగ్‌కు రానున్న కంపెనీలివే : ప్రైజర్‌ విజ్‌టెక్‌, సతీ పోలీప్టాస్ట్‌, త్రీ ఎం పేపర్‌ బోర్డ్స్‌, ఏలియా కమోడిటీస్‌, తున్వాల్‌ ఈ-మోటార్స్‌, మాకాబ్స్‌ టెక్నాలజీస్‌, కటారియా ఇండస్ర్టీస్‌. ఇవన్నీ ఎంఎ్‌సఈ విభాగంలోనివి కాగా మొక్కలకు చెందిన పోషకాహార ఉత్పత్తుల తయారీలోని సాన్‌స్టార్‌ కంపెనీ 26వ తేదీన ప్రధాన ఎక్స్ఛేంజీలో లిస్టింగ్‌ కానుంది.

Updated Date - Jul 22 , 2024 | 06:01 AM