సరికొత్తగా.. బజాజ్ చేతక్
ABN , Publish Date - Jan 05 , 2024 | 06:33 AM
దేశీయ వాహన కంపెనీ బజాజ్ ఆటో.. అప్డేటెడ్ చేతక్ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. 5 అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే స్ర్కీన్తో కూడిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు (అర్బన్, ప్రీమియం)...
2 వేరియంట్లలో లభ్యం
ప్రారంభ ధర 1.15 లక్షలు
న్యూఢిల్లీ: దేశీయ వాహన కంపెనీ బజాజ్ ఆటో.. అప్డేటెడ్ చేతక్ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. 5 అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే స్ర్కీన్తో కూడిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు (అర్బన్, ప్రీమియం) వేరియంట్లలో లభించనుంది. వీటి ధరలను రూ.1,15,001, రూ.1,35,463గా నిర్ణయించారు. ఇవి ఢిల్లీ ఎక్స్షోరూం ధరలు. 3.2 కిలోవాట్ బ్యాటరీతో కూడిన ఈ స్కూటర్.. పూర్తి చార్జింగ్తో 127 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. అంతేకాదు, గంటకు 73 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో దూసుకుపోతుందని కంపెనీ వెల్లడించింది. కాగా ఈ స్కూటర్ కొనుగోలుదారులకు కంపెనీ టెక్ప్యాక్ను అప్షనల్గా అందుబాటులోకి తెచ్చింది. టెక్ప్యాక్ ద్వారా టర్న్ బై టర్న్ నావిగేషన్, మ్యూజిక్, కాల్ కంట్రోల్స్, హిల్ హోల్డ్ మోడ్ వంటి ఫీచర్లను వినియోగించుకునే వీలుంటుంది. అంతేకాదు, సెల్ఫ్ క్యాన్సెలింగ్ టర్న్ ఇండికేటర్స్, ఎలకా్ట్రనిక్ హ్యాండిల్ అండ్ స్టీరింగ్ లాక్స్, సీట్ స్విచెస్, హెల్మెట్ బాక్స్ ల్యాంప్, రివర్స్ గేర్ మోడ్ వంటి ఫీచర్లు కూడా ఈ స్కూటర్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. బజాజ్ ఆటో ఇప్పటివరకు లక్షకు పైగా ఎలక్ట్రిక్ చేతక్లను మార్కెట్లో విక్రయించింది.