Share News

రూ.700 కోట్లతో దివీస్‌ విస్తరణ

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:23 AM

హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే ఫార్మా దిగ్గజం దివీస్‌ లేబొరేటరీస్‌ తన ఉత్పత్తి సామర్ధ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందుకోసం రూ.700 కోట్లతో ప్రత్యేక యూనిట్‌ ఏర్పాటు చేస్తోంది...

రూ.700 కోట్లతో దివీస్‌  విస్తరణ

హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే ఫార్మా దిగ్గజం దివీస్‌ లేబొరేటరీస్‌ తన ఉత్పత్తి సామర్ధ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందుకోసం రూ.700 కోట్లతో ప్రత్యేక యూనిట్‌ ఏర్పాటు చేస్తోంది. 2027 జనవరి నాటికి ఈ యూనిట్‌ ఉత్పత్తి ప్రారంభిస్తుందని కంపెనీ తెలిపింది. ఒక ఖాతాదారుడితో కుదిరిన దీర్ఘకాలిక సరఫరా ఒప్పందం షరతులు నెరవేర్చేందుకు ఈ విస్తరణ చేపడుతున్నట్టు తెలిపింది. అయితే ఆ ఖాతాదారుడి పేరుగానీ, ఏ ఉత్పత్తిని ఎంత కాలం ఆ ఖాతాదారుడికి సరఫరా చేస్తారు? అనే వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ఈ విస్తరణ ప్రాజెక్టుకు అవసరమైన రూ.700 కోట్లను అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకుంటామని దివీస్‌ ల్యాబ్స్‌ తెలిపింది.

Updated Date - Apr 26 , 2024 | 04:23 AM