Share News

ఫ్రియర్‌ ఎనర్జీ నుంచి ‘ఎక్స్‌పీరియన్స్‌’ సెంటర్లు

ABN , Publish Date - Sep 20 , 2024 | 05:02 AM

నివాస గృహా లు, ఎంఎ్‌సఎంఈలకు రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్‌ వ్యవస్థ లు సరఫరాచేసే ‘ఫ్రియర్‌ ఎనర్జీ’ తన సేవలను మరింత విస్తరిస్తోంది. ఇందులో బాగంగా శనివారం కరీంనగర్‌లో తొలి ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ ఏర్పాటుచేస్తోంది...

ఫ్రియర్‌ ఎనర్జీ నుంచి ‘ఎక్స్‌పీరియన్స్‌’ సెంటర్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నివాస గృహా లు, ఎంఎ్‌సఎంఈలకు రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్‌ వ్యవస్థ లు సరఫరాచేసే ‘ఫ్రియర్‌ ఎనర్జీ’ తన సేవలను మరింత విస్తరిస్తోంది. ఇందులో బాగంగా శనివారం కరీంనగర్‌లో తొలి ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ ఏర్పాటుచేస్తోంది. వచ్చే నెల విశాఖపట్టణం, విజయవాడల్లోనూ ఈ కేంద్రాలు ఏర్పా టు చేస్తామని కంపెనీ ఎండీ సౌరభ్‌ మర్డా చెప్పారు. వచ్చే రెండేళ్లలో తాము పని చేస్తున్న ఆరు రాష్ట్రాల్లోని 48 నగరాలకు ఈ కేంద్రాలను విస్తరిస్తామన్నారు. ఈ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాల్లో కంపెనీ ఏర్పాటు చేసే రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్‌ వ్యవస్థలకు సంబంధించిన అన్ని సేవలు ఒకేచోట లభ్యమవుతాయి. తమ ఇంటిపై రూఫ్‌టాప్‌ సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలనుకునే వ్యక్తు లు, సంస్థలు ఈ కేంద్రాల ద్వారా లేదా యాప్‌ ద్వారా తమను సంప్రదిస్తే ప్రభుత్వ సబ్సిడీ, రుణాలు మొదలుకుని అన్ని రకాల సేవలు అందిస్తామని సౌరభ్‌ చెప్పారు.


గత ఆర్థిక సంవత్సరం రూ.100 కోట్లున్న తమ టర్నోవర్‌ ఈ ఆర్థిక సంవత్సరం రెట్టింపు అవుతుందని ఆశిస్తున్నట్టు కంపెనీ కౌ-ఫౌండర్‌, డైరెక్టర్‌ రాధికా చౌదరి తెలిపారు. ఐదేళ్ల వారెంటీతో తమ రూఫ్‌టాప్‌ సోలార్‌ సిస్టమ్స్‌ లభిస్తాయన్నారు.

Updated Date - Sep 20 , 2024 | 05:02 AM