Share News

ఎస్‌బీఐ రూ.10 వేల కోట్ల సమీకరణ

ABN , Publish Date - Jul 11 , 2024 | 01:37 AM

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్ల ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించినట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ బుధవారం వెల్లడించింది...

ఎస్‌బీఐ రూ.10 వేల కోట్ల సమీకరణ

న్యూఢిల్లీ: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్ల ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించినట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ బుధవారం వెల్లడించింది. 15 ఏళ్ల కాలపరిమితితో కూడిన ఈ బాండ్లపై ఏటా రూ.7.36 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. మౌలిక సదుపాయాలు, అందుబాటు గృహాల నిర్మాణ రంగ సంస్థలకు దీర్ఘకాలిక రుణాలందించేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు ఎస్‌బీఐ స్పష్టం చేసింది.

Updated Date - Jul 11 , 2024 | 01:37 AM