పన్ను వసూళ్లు రూ.34.37 లక్షల కోట్లు
ABN , Publish Date - Apr 03 , 2024 | 01:48 AM
మార్చితో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.34.37 లక్షల కోట్లు చేరాయి. ఇవి గత ఆర్థిక సంవత్సరానికి సవరించిన పన్ను వసూళ్ల లక్ష్యానికి దగ్గరగా ఉన్నాయి...
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.34.37 లక్షల కోట్లు చేరాయి. ఇవి గత ఆర్థిక సంవత్సరానికి సవరించిన పన్ను వసూళ్ల లక్ష్యానికి దగ్గరగా ఉన్నాయి. ఇందులో రూ.18.90 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నుల ద్వారా వసూలయ్యాయని అధికార వర్గాలు చెప్పాయి. ఆర్థిక వ్యవస్థ జోరు మీద ఉండడంతో ఈ లక్ష్య సాధన సాధ్యమైంది.