Share News

హెచ్‌జడ్‌ఎల్‌ ఓఎఫ్‌ఎస్‌ పెంచిన వేదాంత

ABN , Publish Date - Aug 15 , 2024 | 12:34 AM

హిందూస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ (హెచ్‌జడ్‌ఎల్‌) ఈక్విటీలో తనకు ఉన్న వాటా నుంచి ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) కింద విక్రయించే వాటాను, వేదాంత లిమిటెడ్‌ 2.60 శాతం నుంచి 3.31 శాతానికి...

హెచ్‌జడ్‌ఎల్‌ ఓఎఫ్‌ఎస్‌ పెంచిన వేదాంత

న్యూఢిల్లీ: హిందూస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ (హెచ్‌జడ్‌ఎల్‌) ఈక్విటీలో తనకు ఉన్న వాటా నుంచి ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) కింద విక్రయించే వాటాను, వేదాంత లిమిటెడ్‌ 2.60 శాతం నుంచి 3.31 శాతానికి పెంచింది. బుధవారం జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశం ఇందుకు ఆమోదం తెలిపింది. ఓఎఫ్‌ఎస్‌లో షేరు ధరను రూ.486గా కంపెనీ ప్రకటించింది. ఇష్యూ 16న ప్రారంభమై 19న ముగుస్తుంది. ఓఎఫ్‌ఎస్‌ కింద వేదాంత లిమిటెడ్‌ అమ్మే హెచ్‌జడ్‌ఎల్‌ షేర్లకు రూ.8,021 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉంది.

Updated Date - Aug 15 , 2024 | 12:34 AM