నిర్లక్ష్యం వీడండి
ABN , Publish Date - Jul 25 , 2024 | 11:24 PM
మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ట్రాన్సఫార్మర్కు, విద్యుత వైర్లకు పిచ్చి మొక్కలు, తీగలు అల్లుకున్నాయి.
ఓబుళదేవరచెరువు : మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ట్రాన్సఫార్మర్కు, విద్యుత వైర్లకు పిచ్చి మొక్కలు, తీగలు అల్లుకున్నాయి. అలాగే ఆంజనేయస్వామి ఆలయం వద్ద విద్యుత తీగలకు రావిచెట్టు కొమ్మలు, పాత మసీదు వద్ద విద్యుత తీగలకు తుమ్మచెట్లు తగులుతున్నాయి. విద్యుత వైర్లకు ఇలా చెట్లు, తీగలు తగులుతూ ఉండటంతో వర్షాకాలంలో పెను ప్రమాదం జరిగే అవకాశముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుతశాఖ అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకముందే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.