Boeing 737 plane: రన్ వేపై జారిన విమానం.. 10 మందికి గాయాలు
ABN , Publish Date - May 09 , 2024 | 07:03 PM
సెనగల్ రాజధాని డాకర్ విమానాశ్రయంలో రన్వే పై బోయింగ్ 737 విమానం జారింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు ఆ దేశ రవాణా శాఖ మంత్రి తెలిపారు.
డాకర్, మే 09: సెనగల్ రాజధాని డాకర్ విమానాశ్రయంలో రన్వే పై బోయింగ్ 737 విమానం జారింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు ఆ దేశ రవాణా శాఖ మంత్రి తెలిపారు. ట్రాన్స్ ఎయిర్ సంస్థకు చెందిన ఎయిర్ సెనగల్ విమానం బుధవారం అర్థరాత్రి బమాకోకు బయలుదేరే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని వివరించారు.
ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 85 మంది ఉన్నారని.. వారిలో 79 మంది ప్రయాణికులు కాగా.. ఇద్దరు పైలెట్లతోపాటు నలుగురు విమాన సిబ్బంది ఉన్నారన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఇక మిగిలిన ప్రయాణికులు హోటల్కు తరలించామని.. వారంతా అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారని సెనగల్ రవాణా శాఖ మంత్రి తెలిపారు.
Read Latest National News And Telugu News