Share News

నేపాల్‌లో వరదలు..66 మంది మృతి

ABN , Publish Date - Sep 29 , 2024 | 04:35 AM

నేపాల్‌ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడి కనీసం 66 మంది మృత్యువాత పడ్డారు.

నేపాల్‌లో వరదలు..66 మంది మృతి

కఠ్మాండూ, సెప్టెంబరు 28: నేపాల్‌ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడి కనీసం 66 మంది మృత్యువాత పడ్డారు. మరో 60మంది గాయపడ్డారు. 79మంది గల్లంతైనట్లు శనివారం అధికారులు తెలిపారు. గురువారం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. దేశవ్యాప్తంగా 3రోజుల పాటు అన్ని బడులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Updated Date - Sep 29 , 2024 | 04:35 AM