Share News

ఆర్టీఐ కింద చీతాల ప్రాజెక్టు సమాచారం ఇవ్వలేం!

ABN , Publish Date - Jul 25 , 2024 | 06:15 AM

చీతాల ప్రాజెక్టు సమాచారం ఇవ్వడానికి మధ్యప్రదేశ్‌ అటవీ శాఖ నిరాకరించింది. వన్యప్రాణి సంరక్షణ కార్యకర్త అజయ్‌ దూబే... సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద

ఆర్టీఐ కింద చీతాల ప్రాజెక్టు సమాచారం ఇవ్వలేం!

న్యూఢిల్లీ, జూలై 24: చీతాల ప్రాజెక్టు సమాచారం ఇవ్వడానికి మధ్యప్రదేశ్‌ అటవీ శాఖ నిరాకరించింది. వన్యప్రాణి సంరక్షణ కార్యకర్త అజయ్‌ దూబే... సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద చేసిన దరఖాస్తును తోసిపుచ్చింది. ఈ సమాచారం వెల్లడిస్తే దేశ భద్రత, విదేశాలతో సంబంధాలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. నమీబియా నుంచి తెచ్చిన 8 చీతాలను 2022 సెప్టెంబరు 17న ప్రధాని మోదీ చేతులమీదుగా మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కులో విడిచిపెట్టారు. తర్వాత గత ఏడాది ఫ్రిబవరిలో అధికారులు దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన మరో 12 చీతాలను విడుదల చేశారు. చీతాలు వరుసగా చనిపోతుండడంతో ఈ ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

Updated Date - Jul 25 , 2024 | 06:15 AM