Share News

NRI: ఏపీలో కూటమి విజయదరహాసం.. అట్లాంటాలో ‘ప్రజా విజయం’ వేడుక

ABN , Publish Date - Jun 24 , 2024 | 03:32 PM

అమెరికాలోని అట్లాంటా మహానగరంలో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు (NRI) కలిసి ప్రజా విజయం పేరిట విజయగర్జన వేడుకలు నిర్వహించారు.

NRI: ఏపీలో కూటమి విజయదరహాసం..  అట్లాంటాలో ‘ప్రజా విజయం’ వేడుక

ఎన్నారై డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి సునామీ సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో అమెరికాలోని అట్లాంటా మహానగరంలో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు (NRI) కలిసి ప్రజా విజయం పేరిట విజయగర్జన వేడుకలు నిర్వహించారు. జూన్ 22న (శనివారం) జార్జియా రాష్ట్రం, అట్లాంటా లోని జేడ్ బాంక్వెట్ హాల్లో ఈ విజయోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. సాయంత్రం 5 గంటల సమయంలో దాదాపు 500 కార్లతో డులూత్ రోడ్లలో అతి పెద్ద ర్యాలీ నిర్వహించారు. టీడీపీ, జనసేన మరియు బీజేపీ బ్యానర్లు, జండాలు, కండువాలతో నినాదాలు చేశారు.

NRI: యూఎస్‌ఏలో మిన్నంటిన ఎన్డీఏ కూటమి విజయోత్సవ సంబరాలు

2.jpg


జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ, జయహో కూటమి అంటూ హోరెత్తించారు. పోలీస్ సెక్యూరిటీ నడుమ కూటమి పార్టీల పాటలతో కొందరు కార్లపైకి ఎక్కి మరీ నినాదాలు చేశారు. మాంచి ఆకలి మీద ఉన్న పులికి దొరికిన విందులా ఈ కూటమి విజయాన్ని ఆస్వాదించారు. తేనీటి విందు అనంతరం మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి డప్పులతో, తీన్మార్ డాన్సులతో వేదిక ప్రాంగణంలోకి ఊరేగింపుగా విచ్చేశారు. వేదిక ప్రాంగణం అంతా బ్యానర్లు, జండాలు, కండువాలతో పసుపు, ఎరుపు రంగుల మయమైంది. ఆహ్వానితులు సైతం పసుపు, ఎరుపు రంగుల వస్త్రాల్లో రావడం విశేషం.

4.jpg


అందరూ ఆశీనులైన అనంతరం వ్యాఖ్యాతలు సురేష్ పెద్ది, సురేష్ కరోతు అందరికీ స్వాగతం పలికారు. ఇండియా నుంచి విచ్చేసిన పెద్దలు, మహిళలతో జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని శుభప్రదంగా ప్రారంభించారు. ముందుగా ఎన్నారై టీడీపీ అట్లాంటా నాయకులు సతీష్ ముసునూరి స్వాగతోపన్యాసం చేశారు. ఇండియా నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు, టీడీపీ, జనసేన లీడర్లు పంపిన పలు వీడియో సందేశాలను ప్రదర్శించారు. వీరందరూ ఎన్నికల సమయంలో ఎన్నారైలు చేసిన కృషిని అభినందించారు. మున్ముందు కూడా రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు.

3.jpg


కూర్చోవడానికి కుర్చీలు కూడా సరిపోనంత జనం రావడం ఒక ఎత్తైతే, నిలబడి కూడా కార్యక్రమం ఆసాంతం తిలకించిన ప్రవాసులు మరొక ఎత్తు. పసందైన విందు భోజనం అనంతరం బాణసంచా కాల్చారు. ముందే ఊహించి 2000 మందికి సరిపడా ఏర్పాట్లు చేశారు. అట్లాంటా వాసి, అందరికీ సుపరిచితులు, గుడివాడ గడ్డపై తెలుగుదేశం జెండాని రెపరెపలాడించిన రాము వెనిగండ్ల జూమ్ మీటింగ్ ద్వారా లైవ్‌లోకి వచ్చి అందరినీ ఉత్సాహపరిచారు. ఎన్నారైల సేవలను, ముఖ్యంగా అట్లాంటా వారి సేవలను అభినందించడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఏ సహాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చని అన్నారు.

తర్వాత కీ నోట్ స్పీకర్స్ మల్లిక్ మేదరమెట్ల, సురేష్ కరోతు, క్రిష్ణప్రియ తదితరులు ప్రసంగించారు. ఫుడ్ కోఆర్డినేటర్ వేణు దండా ఫుడ్ స్పాన్సర్స్ అందరినీ పేరు పేరునా అభినందించారు. మొట్టమొదటిసారి అట్లాంటా లోని రెస్టారెంట్స్ అన్నీ కలిసికట్టుగా ముందుకు రావడం విశేషం అన్నారు. భోజనాల అనంతరం ఎన్నారై టీడీపీ అట్లాంటా, టీం అట్లాంటా జనసేన నాయకుల నడుమ కూటమి కేక్‌ కట్ చేసి అందరికీ పంచారు.

Read Latest NRI News and Telugu News

Updated Date - Jun 24 , 2024 | 03:50 PM