Share News

NRI: ఏపీలో ఎన్డీఏ విజయం.. మేరీల్యాండ్‌లో ఎన్నారైల విజయోత్సవ సంబరాలు

ABN , Publish Date - Jul 01 , 2024 | 02:38 PM

ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడంపై ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో అమెరికాలోని మేరిల్యాండ్‌లో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.

NRI: ఏపీలో ఎన్డీఏ విజయం.. మేరీల్యాండ్‌లో ఎన్నారైల విజయోత్సవ సంబరాలు

మేరిల్యాండ్: రాష్ట్ర పునర్ నిర్మాణంలో ఎన్ఆర్ఐలు (NRI) కీలక పాత్ర పోషించాలని ప్రముఖ వైద్యులు హేమ ప్రసాద్ యడ్ల పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఇందుకు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రవాసాంధ్రులు సద్వినియోగం చేసుకుని రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని, రాజధాని అమరావతి నిర్మాణంలోనూ భాగస్వాములై తమవంతు సహాయ సహకారాలు అందించాలన్నారు.

NRIs: న్యూయార్క్‌లో టీడీపీ కూటమి విజయోత్సవ వేడుకలు

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడంపై ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో అమెరికాలోని మేరిల్యాండ్‌లో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్, రామోజీరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు.

6.jpgశాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పాలన ఎలా ఉండాలో, ముఖ్యమంత్రి ఎలా ఉండాలో చంద్రబాబును చూసి నేర్చుకోవాలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ.. అరాచక, అభివృద్ధి నిరోధక శక్తులను సాగనంపడంలో ప్రజలు చైతన్యం చూపారని అన్నారు. రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగిందని తెలిపారు

7.jpg


గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ఈ చారిత్రక విజయం అందించడంలో రామోజీరావు కీలకపాత్ర వహించారన్నారు. అక్షరాన్ని ఆయుధంగా మలచి, సమాజాన్ని అదిలించి కదలించి, ప్రశ్నించే తత్వాన్ని బోధించారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఆర్థిక నేరస్థులు, హంతకులకు చోటులేదని ఈ ఎన్నికలు రుజువు చేశాయని అన్నారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పోట్లూరి భాస్కర్ రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో ఏమాత్రం పారిశ్రామిక అభివృద్ధి జరగలేదని అన్నారు. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలను తరిమివేశారని ఆరోపించారు. ప్రస్తుత చంద్రబాబు పాలనలో పారిశ్రామికీకరణ జరుగుతుందని చెప్పారు. పారిశ్రామిక రంగానికి అన్ని విధాల ప్రోత్సాహం ఉంటుందన్నారు.

5.jpgఈ కార్యక్రమంలో శ్రీనాథ్ రావుల, శివ నెలకుదిటి, సత్యనారాయణ మన్నె, భాను మాగులూరి, శ్రీనివాస్ దామ, రాజా రావులపల్లి, శివ నెల్లూరి, రాజశేఖర్ చెరుకూరి, హరీష్ కూకట్ల, శ్రీనివాస్ సామినేని, శ్రీను పోతు, సుందర్ క్రోసూరి, మురళి ముల్పురి, హర్ష పేరమనేని తదితరులు పాల్గొన్నారు. ఈ విజయోత్సవ వేడకుల్లో పెద్దఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.

2.jpg4.jpg3.jpgRead Latest NRI News and Telugu News

Updated Date - Jul 01 , 2024 | 02:43 PM