Share News

NRI: వరద బాధితుల సహాయార్థం ఎన్నారై టీడీపీ యూఎస్ఏ విరాళం

ABN , Publish Date - Sep 16 , 2024 | 09:51 PM

ఇటీవల ఏపీలో సంభవించిన వరదల్లో నష్టపోయిన బాధితులను ఆదుకునే నిమిత్తం ఏర్పాటు చేసిన ఏపీ సీఎం సహాయ నిధికి ఉత్తర అమెరికా ఎన్నారై టీడీపీ శ్రేణులు రూ.25 లక్షల విరాళాన్ని అందజేశాయి.

NRI: వరద బాధితుల సహాయార్థం ఎన్నారై టీడీపీ యూఎస్ఏ విరాళం

ఎన్నారై డెస్క్: ఇటీవల ఏపీలో సంభవించిన వరదల్లో నష్టపోయిన బాధితులను ఆదుకునే నిమిత్తం ఏర్పాటు చేసిన ఏపీ సీఎం సహాయ నిధికి ఉత్తర అమెరికా ఎన్నారై (NRI) టీడీపీ శ్రేణులు రూ.25 లక్షల విరాళాన్ని అందజేశాయి. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును శుక్రవారం నాడు డల్లాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ డా. పెమ్మసాని చంద్రశేఖర్‌కు అందజేశారు. పార్టీ కోసమే గాక, ప్రజల కోసం కూడా పరితపించే కార్యకర్తలు కేవలం టీడీపీకే సొంతమని డా. పెమ్మసాని పేర్కొన్నారు. ఈ విరాళాలు అందజేసినవారికి ధన్యవాదాలు తెలిపారు.

Dr Chandrasekhar Pemmasani: ‘సమాజం కోసమే రాజకీయాల్లోకి వచ్చా’

Read Latest and NRI News

Updated Date - Sep 16 , 2024 | 09:52 PM