Yagam: చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం...

ABN, Publish Date - Feb 17 , 2024 | 11:15 AM

అమరావతి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తన నివాసంలో రాజశ్యామల యాగాన్ని చేపట్టారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు. 50 మంది రిత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. రాజశ్యామల యాగంలో భాగంగా మూడు రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నారు. ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగియనుంది.

Yagam: చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం... 1/6

ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో రాజశ్యామల యాగం.. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు దంపతులు..

Yagam: చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం... 2/6

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరుగుతున్న రాజశ్యామల యాగంలో పాల్గొన్న రుత్వికులు.. యాగం నిర్వహిస్తున్న దృశ్యం.

Yagam: చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం... 3/6

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు దంపతులకు తిలకం దిద్దుతున్న వేద పండితుడు.

Yagam: చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం... 4/6

రాజశ్యామల యాగంలో పాల్గొన్న చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి..

Yagam: చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం... 5/6

రాజశ్యామల యాగం సందర్భంగా యజ్జమూర్తులకు పూజలు చేస్తున్న నారా భువనేశ్వరి..

Yagam: చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం... 6/6

రాజశ్యామల యాగంలో భాగంగా వేద పండితులు మంత్రాలు చదువుతుండగా చంద్రబాబు దంపతులు పూజలు నిర్వహిస్తున్న దృశ్యం..

Updated at - Feb 17 , 2024 | 11:15 AM