Share News

Viral: కిలాడీ జంట! చచ్చిన ఈగలతో వీళ్లేం చేస్తారో తెలిస్తే..

ABN , Publish Date - Jun 25 , 2024 | 08:44 PM

చచ్చిన ఈగతో సాయంతో ఖరీదైన రెస్టారెంట్లను బ్లాక్ మెయిల్ చేసి ఉచితంగా ఫుడ్ తింటున్న ఓ జంట ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Viral: కిలాడీ జంట! చచ్చిన ఈగలతో వీళ్లేం చేస్తారో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల అనేక రెస్టారెంట్లు, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఫుడ్స్‌లో ఈగలు, దోమలు, బొద్దింకల వంటివి బయటపడుతూ కస్టమర్లను హడలెత్తిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో దాదాపుగా ప్రతిరోజూ ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తున్నాయి. అయితే, ఈ ట్రెండ్‌ను ఆసరాగా చేసుకున్న ఓ కిలాడీ జంట ఏకంగా ఫైవ్ స్టార్ హోటళ్లను బ్లాక్ మెయిల్ చేసి ఫ్రీగా ఫుడ్ తినేస్తున్నారు. తనకెదురైన అనుభవాన్ని వివరిస్తూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా (Viral) మారింది.

Viral: ఈ బీటెక్ విద్యార్థి చేసిన తప్పు ఎవరూ చేయొద్దు! రూ.46 లక్షల నష్టం!


ఉదిత్ భండారీ అనే నెటిజన్ ఈ మోసం గురించి నెట్టింట పంచుకున్నాడు. ఫైవ్ స్టార్ హోటళ్లను బురిడీ కొట్టించి ఫ్రీగా ఫుడ్ ఎలా తింటున్నదీ ఓ జంట తమకు వివరించిందని తెలిపారు. ఓ పార్టీ సందర్భంగా ఆ భార్యభర్తలు తనకు తారసపడ్డారన్నాడు. వాళ్ల బ్లాక్‌మెయిల్ స్టోరీ చూసి దిమ్మెరపోయానని చెప్పాడు. అతడు తెలిపిన వివరాల ప్రకారం, ఆ జంట చచ్చిన ఈగను తీసుకుని ఖరీదైన హోటళ్లకు వెళతారు. అక్కడ ఫుడ్ ఆర్డరిచ్చి తినడం ప్రారంభిస్తారు. ఆ తరువాత ఎవరూ చూడకుండా తమ వద్ద ఉన్న చచ్చిన ఈగను ఆహారంలో వేసి రభస మొదలెడతారు. ఆహార నాణ్యత లోపించిందంటూ హోటళ్ల యాజమాన్యాలను దడదడలాడిస్తారు. దీంతో, వారు జంటను శాంత పరిచేందుకు ఫ్రీగా ఫుడ్ తిని వెళ్లండని బతిమలాడతారు (Internet Fumes Over Couple Using Dead Fly To Avoid Paying At Restaurants ).


ఈ ట్రిక్‌తో తాము అనేక సార్లు ఫ్రీగా ఫుడ్ ఎంజాయ్ చేసిన వచ్చామని ఆ జంట తనతో చెప్పినట్టు సదరు నెటిజన్ వివరించాడు. కొన్ని సార్లు సరదా కోసం హోటల్ వాళ్లను ఇలా బురిడీ కొట్టిస్తుంటామని వాళ్లు అన్నట్టు తెలిపాడు. ఈ ఉదంతం నెట్టింట వైరల్ కావడంతో జనాలు ఆ జంటపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ ప్రపంచంలో ఇలాంటోళ్లు కూడా ఉంటారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి కిలాడీ జంటలు తమకు తారసపడనందుకు తామెంతో అదృష్టవంతులమని కొందరు వ్యాఖ్యానించారు.

Read Viral and Telugu News

Updated Date - Jun 25 , 2024 | 08:57 PM