Share News

ఆంధ్రకి మళ్లీ ఆడతా!

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:22 AM

టీమిండియా క్రికెటర్‌, ఆంధ్ర రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ హనుమ విహారి (30) తిరిగి ఆంధ్ర జట్టుకు ఆడతానని వెల్లడించాడు. మంగళవారం ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆహ్వానం మేరకు ఆయనను విహారి

ఆంధ్రకి మళ్లీ ఆడతా!

అమరావతి (ఆంధ్రజ్యోతి): టీమిండియా క్రికెటర్‌, ఆంధ్ర రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ హనుమ విహారి (30) తిరిగి ఆంధ్ర జట్టుకు ఆడతానని వెల్లడించాడు. మంగళవారం ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆహ్వానం మేరకు ఆయనను విహారి మర్యాదపూర్వకంగా కలిశాడు. లోకేశ్‌ను కలవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా విహారి అన్నాడు. ‘ఆంధ్రకు తిరిగి ప్రాతినిథ్యం వహించాలని, తన పూర్తి మద్దతు ఉంటుందని లోకేశ్‌ భరోసా ఇచ్చారు. గతంలో నాకు జరిగిన అవమానాలు, బలవంతంగా నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంలాంటి సంఘటనలతో ఆంధ్రకు ఆడకూడదనుకున్నా. కానీ, లోకేశ్‌ను కలిశాక నిర్ణయం మార్చుకున్నా’ అని విహారి చెప్పాడు. అనంతరం విహారి ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ను జనసేన కార్యాలయంలో కలిశాడు.

విహారి

Updated Date - Jun 26 , 2024 | 05:22 AM