10న ఏపీఎల్ ట్రయల్స్
ABN , Publish Date - May 08 , 2024 | 03:43 AM
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) వేలంలో పాల్గొనడానికి అవకాశం లభించని క్రికెటర్ల కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ‘రైజింగ్ స్టార్స్’ పేరిట...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) వేలంలో పాల్గొనడానికి అవకాశం లభించని క్రికెటర్ల కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ‘రైజింగ్ స్టార్స్’ పేరిట సెలెక్షన్ ట్రయల్స్కు శ్రీకారం చుట్టింది. ఈనెల 10వ తేదీన విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో, మంగళగిరిలోని ఏసీఏ మైదానంలో, కడపలోని వైఎస్సార్ స్టేడియంలో ట్రయల్స్ నిర్వహించనున్నామని, ఇందులో గుర్తించిన 12 మంది ప్రతిభావంతులకు ఏపీఎల్లో ఆడే అవకాశం కల్పిస్తామని ఏసీఏ తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి 10 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6.30 వరకు ట్రయల్స్ నిర్వహిస్తారు. ఆసక్తి గల వారు బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు ఈ లింక్ జ్ట్టిఞ://15.206.63.242/అఇ/ఞజ్చూడ్ఛటౖఞ్ఛుఽఖ్ఛజజీట్టట్చ్టజీౌుఽ/జౌటఝ/ ద్వారా తమ పేరును నమోదు చేసుకోవచ్చు.