Share News

Surekha team : సురేఖ జట్టుకు హ్యాట్రిక్‌ స్వర్ణం

ABN , Publish Date - Jun 23 , 2024 | 06:19 AM

ఫామ్‌లో ఉన్న భారత మహిళల కాంపౌండ్‌ ఆర్చరీ జట్టు వరల్డ్‌క్‌పలో ‘హ్యాట్రిక్‌’ స్వర్ణంతో అరుదైన ఘనతను అందుకొంది. శనివారం జరిగిన వరల్డ్‌కప్‌ స్టేజ్‌-3 టీమ్‌ ఫైనల్లో జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌ల

Surekha team : సురేఖ జట్టుకు హ్యాట్రిక్‌ స్వర్ణం

అంటాల్యా (టర్కీ): ఫామ్‌లో ఉన్న భారత మహిళల కాంపౌండ్‌ ఆర్చరీ జట్టు వరల్డ్‌క్‌పలో ‘హ్యాట్రిక్‌’ స్వర్ణంతో అరుదైన ఘనతను అందుకొంది. శనివారం జరిగిన వరల్డ్‌కప్‌ స్టేజ్‌-3 టీమ్‌ ఫైనల్లో జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌ల త్రయం 232-229తో ఎస్తోనియాను ఓడించింది. షాంఘైలో జరిగిన స్టేజ్‌-1, యెచియాన్‌లో జరిగిన స్టేజ్‌-2లో కూడా పసిడి పతకాలు సాధించిన కాంపౌండ్‌ జట్టు.. వరుసగా స్టేజ్‌-3లో స్వర్ణ కాంతులీనింది. పురుషుల వ్యక్తిగత ఈవెంట్‌ ఫైనల్లో 148-149తో స్లాషెర్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో ఓడిన ప్రియాన్ష్‌ రజతంతో సరిపెట్టుకొన్నాడు. కాగా, ఆదివారం జరిగే రికర్వ్‌ విభాగంలో భారత్‌ మూడు స్వర్ణాల కోసం తలపడనుంది. వ్యక్తిగత, మిక్స్‌డ్‌లో ధీరజ్‌ బొమ్మదేవర.. మహిళల ఈవెంట్‌లో అంకిత భక్త్‌ ఫైనల్లో ఆడనున్నారు.

Updated Date - Jun 23 , 2024 | 06:19 AM