Share News

Indonesia Open : క్వార్టర్‌ఫైనల్లో లక్ష్యసేన్‌

ABN , Publish Date - Jun 07 , 2024 | 05:04 AM

స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. లక్ష్యసేన్‌ తప్ప గురువారం బరిలో దిగిన ఇతర భారత ఆటగాళ్లంతా పరాజయంతో టోర్నీ నుంచి వైదొలిగారు.

Indonesia Open : క్వార్టర్‌ఫైనల్లో లక్ష్యసేన్‌

జకార్తా: స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. లక్ష్యసేన్‌ తప్ప గురువారం బరిలో దిగిన ఇతర భారత ఆటగాళ్లంతా పరాజయంతో టోర్నీ నుంచి వైదొలిగారు. పురుషుల సింగిల్స్‌ ప్రీక్వార్టర్స్‌ పోరులో లక్ష్యసేన్‌ 21-9, 21-15తో కెంటా నిషిమోటో (జపాన్‌)ను చిత్తు చేశాడు. ఇక ప్రియాన్షు రజావత్‌ 10-21, 17-21తో వితిద్‌శర్న్‌ చేతిలో పోరా డి ఓడాడు. మహిళల డబుల్స్‌ రౌండ్‌-16 పోరులో గాయత్రి/ట్రీసా ద్వయం 21-19, 19-21, 19-21తో మట్సుమోటో/నగహారా (జపాన్‌) జంట చేతిలో ఓటమి చవిచూసింది. అశ్వినీ పొన్నప్ప/తనీషా క్రాస్టో 13-21, 19-21తో హ నా బేక్‌/సొ హీ లీ (దక్షిణ కొరియా) చేతిలో పరాజయం పాలైంది. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్స్‌లో సుమిత్‌/సిక్కిరెడ్డి 9-21, 11-21తో సివీ జెంగ్‌/యోంగ్‌ (చైనా) చేతిలో ఓటమి పాలైంది.

Updated Date - Jun 07 , 2024 | 05:04 AM