Share News

నన్ను తిట్టింది ఎవరు?

ABN , Publish Date - Aug 17 , 2024 | 06:05 AM

ఒలింపిక్స్‌ సమయంలో పారి్‌సలో ఎండలు మండిపోయాయి. సూర్యుడి భగభగలకు అథ్లెట్లు అల్లాడిపోయారు. విశ్వ క్రీడలను పర్యావరణ సహితంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో క్రీడా గ్రామంలోని

నన్ను తిట్టింది ఎవరు?
PM Narendra Modi

  • అథ్లెట్లతో మోదీ సరదా వ్యాఖ్యలు

PM Narendra Modi with Athletes: ఒలింపిక్స్‌ సమయంలో పారి్‌సలో ఎండలు మండిపోయాయి. సూర్యుడి భగభగలకు అథ్లెట్లు అల్లాడిపోయారు. విశ్వ క్రీడలను పర్యావరణ సహితంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో క్రీడా గ్రామంలోని ఏ గదిలోనూ ఎయిర్‌ కండిషనర్లు ఏర్పాటు చేయలేదు. ఎండకు మన క్రీడాకారులు తట్టుకోలేకపోవడంతో పారి్‌సలోని భారత రాయబార కార్యాలయ అధికారులు హుటాహుటిన 40 పోర్టబుల్‌ ఏసీలను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన ప్రధాని..అథ్లెట్లతో జోక్‌ చేశారు. ‘నిజం చెప్పండి. మోదీ బాగా మాటలు చెబుతారు. కానీ గేమ్స్‌ విలేజ్‌ రూములలో ఏసీ ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలని మీలో ఎవరు నన్ను తిట్టుకున్నారు’ అని ప్రధాని నవ్వుతూ ప్రశ్నించారు.

Updated Date - Aug 17 , 2024 | 07:59 AM