Share News

అంతరిక్ష కేంద్రంలో ‘ఒలింపిక్స్‌’

ABN , Publish Date - Jul 28 , 2024 | 06:17 AM

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనూ ఒలింపిక్‌ ప్రారంభం సంబరాలు నిర్వహించారు. భారత సంతతికి చెందిన సునితా విలియమ్స్‌ సహా ఆరుగురు నాసా వ్యోమగాములు ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న సంగతి తెలిసిందే. వీ

అంతరిక్ష కేంద్రంలో ‘ఒలింపిక్స్‌’

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనూ ఒలింపిక్‌ ప్రారంభం సంబరాలు నిర్వహించారు. భారత సంతతికి చెందిన సునితా విలియమ్స్‌ సహా ఆరుగురు నాసా వ్యోమగాములు ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న సంగతి తెలిసిందే. వీరంతా ఒలింపిక్‌ టార్చ్‌ను తమమధ్య అందజేసుకున్నారు. జానెట్‌ ఎప్‌ నుంచి ప్రారంభించి బుచ్‌విల్‌మోర్‌, సునితా విలియమ్స్‌ ఒకరికొరు జ్యోతిని అందించుకున్నారు. అంతేకాదు..ఒలింపిక్స్‌ను పురస్కరించుకొని వారు కొన్ని క్రీడాంశాలను ప్రదర్శించారు. సునిత జిమ్నాస్టిక్స్‌ చేయగా, బరాట్‌ డిస్క్‌ను విసిరాడు. చివరగా వ్యోమగాములంతా ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలిపారు. రెండు నిమిషాల ఈ వీడియోను నాసా విడుదలజేసింది.

Updated Date - Jul 28 , 2024 | 06:18 AM