Priyanshu Rajawat : సేన్కు రజావత్ షాక్
ABN , Publish Date - Jan 17 , 2024 | 03:26 AM
భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ ఇండియా ఓపెన్లో అదరగొట్టాడు. మంగళవారం మొదలైన ఈ సూపర్ 750 బ్యాడ్మింటన్
ఇండియా ఓపెన్లో ప్రణయ్ ముందంజ
న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ ఇండియా ఓపెన్లో అదరగొట్టాడు. మంగళవారం మొదలైన ఈ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో రజావత్ తనకంటే సీనియర్, స్టార్ షట్లర్ లక్ష్యసేన్కు షాకిచ్చాడు. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో ప్రపంచ 30వ ర్యాంకర్ రజావత్ 16-21, 21-16, 21-13తో ప్రపంచ 19వ ర్యాంకర్ లక్ష్యసేన్ను చిత్తుచేశాడు. వరుసగా రెండో టోర్నీలోనూ మొదటిరౌండ్లోనే ఓడిన సేన్.. ఒలింపిక్కు అర్హత సాధించే అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నాడు. ఇక వెటరన్ స్టార్ హెచ్ఎస్ ప్రణయ్ 21-6, 21-19తో 13వ ర్యాంకర్ చో తిన్ చెన్ (చైనీస్ తైపీ)ని కంగుతినిపించి రెండోరౌండ్లో ప్రియాన్షు రజావత్తో పోరుకు సిద్ధమయ్యాడు. మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ, రీతూపర్ణ పండా-శ్వేతాపర్ణ పండా జోడీలు ఆరంభ రౌండ్లోనే ఓటమిపాలయ్యారు.