టీటీలో భారత్ నెంబర్ వన్ శ్రీజ
ABN , Publish Date - Apr 24 , 2024 | 04:46 AM
హైదరాబాద్ స్టార్ ప్యాడ్లర్, కామన్వెల్త్ క్రీడల పతకధారి ఆకుల శ్రీజ జాతీయ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది...
టీటీ జాతీయ ర్యాంకింగ్స్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్ స్టార్ ప్యాడ్లర్, కామన్వెల్త్ క్రీడల పతకధారి ఆకుల శ్రీజ జాతీయ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో తెలుగమ్మాయి శ్రీజ.. మనికా బాత్రాను వెనక్కి నెట్టి, టాప్కి చేరింది. అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో శ్రీజ ప్రస్తుతం 38వ స్థానంలో ఉంది. ఇటీవల జరిగిన డబ్ల్యూటీటీ ఫీడర్ కార్పొస్ క్రిస్టీ, డబ్ల్యూటీటీ ఫీడర్ బీరూట్ టైటిళ్లను శ్రీజ కైవసం చేసుకోవడం తెలిసిందే. పురుషుల్లో శరత్ కమల్ జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంక్ను దక్కించుకోగా, అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో 37వ స్థానంలో కొనసాగుతున్నాడు.