ఐకమత్యం లేదు.. అది జట్టా?
ABN , Publish Date - Jun 18 , 2024 | 04:40 AM
టీ20 వరల్డ్క్పలో గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టిన పాకిస్థాన్ జట్టుపై చీఫ్ కోచ్ గ్యారీ కిర్స్టెన్ తీవ్ర విమర్శలు చేశాడు. పాక్ టీమ్లో ఐకమత్యమే లేదన్నాడు...
పాక్పై కోచ్ కిర్స్టెన్ విమర్శలు
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్క్పలో గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టిన పాకిస్థాన్ జట్టుపై చీఫ్ కోచ్ గ్యారీ కిర్స్టెన్ తీవ్ర విమర్శలు చేశాడు. పాక్ టీమ్లో ఐకమత్యమే లేదన్నాడు. తన సుదీర్ఘ కోచింగ్ కెరీర్లో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ ఎదురుకాలేదని చెప్పాడు. ‘పాక్ టీమ్లో ఒక్కొక్కరిది ఒకో దారి. వారిలో ఐకమత్యం లేదు.. కానీ జట్టు అని పిలుస్తుంటారు. ఎన్నో టీమ్లతో పని చేశా. ఎన్నడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేద’ని కిర్స్టెన్ అన్నాడు. మిగతా అగ్రశ్రేణి జట్లతో పోల్చితే నైపుణ్యాల పరంగా పాక్ ఎంతో వెనుకబడిందని చెప్పాడు.