Share News

అమ్మో..అది ఎంత భయపెట్టిందో!

ABN , Publish Date - Aug 25 , 2024 | 05:51 AM

ఐదేళ్ల క్రితం ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో స్టార్‌ క్రికెటర్లు కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దాంతో వారిద్దరిపై బీసీసీఐ చెరో రూ. 20 లక్షల జరిమానా విధించడంతోపాటు...

అమ్మో..అది ఎంత భయపెట్టిందో!

న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో స్టార్‌ క్రికెటర్లు కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దాంతో వారిద్దరిపై బీసీసీఐ చెరో రూ. 20 లక్షల జరిమానా విధించడంతోపాటు సస్పెన్షన్‌ వేటు కూడా వేసింది. నాటి ఉదంతాన్ని కేఎల్‌ రాహుల్‌ తాజాగా ఓ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నాడు. ‘నేను ఎంతో సిగ్గరిని. టీమిండియాకు ఆడడం ప్రారంభించాక నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. 100 మంది ఎదుట కూడా అనర్గళంగా మాట్లాడేవాడిని. అయితే ఇప్పుడు అలా చేయలేకపోతున్నా. కాఫీ విత్‌ కరణ్‌ ఇంటర్వ్యూ నన్ను ఎంతో భయపెట్టింది. స్కూల్లో నేనెప్పుడూ సస్పెండ్‌ కాలేదు. కానీ ఆ ఇంటర్వ్యూ తర్వాత జీవితంలో తొలిసారి శిక్షకు గురి కావాల్సి వచ్చింది. దానిని ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు. అదిప్పటికీ మాయని మచ్చలా మిగిలింది’ అని రాహుల్‌ అన్నాడు.

Updated Date - Aug 25 , 2024 | 05:51 AM