చంపేస్తాం..
ABN , Publish Date - May 31 , 2024 | 05:50 AM
విరాట్ కోహ్లీపై పరోక్ష విమర్శలు చేసిన టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడుకు తీవ్ర స్థాయిలో బెదిరింపులు వస్తున్నాయి. గత ఆదివారం ఐపీఎల్ ఫైనల్ ముగిసిన అనంతరం...
రాయుడి కుటుంబానికి బెదిరింపులు
సోషల్ మీడియాలో కోహ్లీ ఫ్యాన్స్ పోస్టులు
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీపై పరోక్ష విమర్శలు చేసిన టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడుకు తీవ్ర స్థాయిలో బెదిరింపులు వస్తున్నాయి. గత ఆదివారం ఐపీఎల్ ఫైనల్ ముగిసిన అనంతరం తెలుగు క్రికెటర్ రాయుడు మాట్లాడుతూ..ఆరెంజ్ క్యాప్లు సాధించిన మాత్రాన, ఐపీఎల్ టైటిల్ రాబోదని పరోక్షంగా విరాట్నుద్దేశించి వ్యాఖ్యానించాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కొందరు కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రాయుడిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకొందరైతే.. ‘చంపుతాం..రేప్ చేస్తాం’ అని రాయుడు కుటుంబాన్ని బెదిరిస్తూ పోస్టులు పెడుతున్నారంటూ అతని సన్నిహిత వర్గాలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, రాయుడు ఐపీఎల్లో సుదీర్ఘకాలం చెన్నై తరఫున ఆడిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ ప్లేఆ్ఫ్సకు ముందు జరిగిన కీలకమైన మ్యాచ్లో బెంగళూరు చేతిలో చెన్నై జట్టు ఓడడంతో రాయుడు ఒకింత ఉద్వేగానికి లోనైన దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి.