రెండో సీడ్కు విదిత్ చెక్
ABN , Publish Date - Apr 16 , 2024 | 02:12 AM
ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీ తొమ్మిదో రౌండ్లో భారత గ్రాండ్మాస్టర్ విదిత్ గుజ్రాతీ అద్భుతంగా పుంజుకొన్నాడు...
క్యాండిడేట్స్ చెస్ టోర్నీ
టొరొంటో: ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీ తొమ్మిదో రౌండ్లో భారత గ్రాండ్మాస్టర్ విదిత్ గుజ్రాతీ అద్భుతంగా పుంజుకొన్నాడు. గత గేమ్లో ఓటమి పాలైన అతడు ఈ రౌండ్లో రెండో సీడ్ హికారు నకమురాకు షాకిచ్చాడు. ఇద్దరు భారత టీనేజ్ ఆటగాళ్లు ప్రజ్ఞానంద-గుకేష్ మధ్య జరిగిన గేమ్ ఫలితం తేలకుండా ముగిసింది. గుకేష్ (5.5), నెపోమ్నియాచి (5.5) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ప్రజ్ఞానంద (5) మూడో స్థానంలో నిలిచాడు. గుజరాతీ (4) సంయుక్తంగా నాలుగోస్థానంలో కొనసాగుతున్నాడు. మహిళల విభాగంలో హంపి (4) తన గేమ్ను డ్రా చేసుకోగా, వైశాలి (2.5) పరాజయం పాలైంది.