‘న్యూయార్క్’ కెప్టెన్గా యువరాజ్
ABN , Publish Date - Feb 15 , 2024 | 03:46 AM
టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ (ఎల్సీటీ) సీజన్-2లో న్యూయార్క్ సూపర్స్టార్ స్ట్రయికర్స్ జట్టు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు..
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ (ఎల్సీటీ) సీజన్-2లో న్యూయార్క్ సూపర్స్టార్ స్ట్రయికర్స్ జట్టు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఆ జట్టులో బాబర్ ఆజమ్, రషీద్ఖాన్, పొలార్డ్ తదితరులు ఆడనున్నారు. 15 ఓవర్ల ఈ టోర్నీ మార్చి 7 నుంచి 18 వరకు శ్రీలంకలోని క్యాండీలో జరగనుంది. 6 జట్లు, 9 రోజులపాటు 18 మ్యాచ్ల్లో తలపడతాయి. ఢిల్లీ, న్యూయార్క్, పంజాబ్, రాజస్థాన్, కొలంబో, చత్తీ్సగఢ్ జట్లు బరిలోకి దిగనున్నాయి. గతేడాది జరిగిన సీజన్-1లో ఇండోర్ నైట్స్, గువాహటి అవెంజర్స్ జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి.