Share News

13 ఏళ్ల అబ్బాయి.. నాన్నమ్మను పొడిచాడు

ABN , Publish Date - Apr 15 , 2024 | 03:35 AM

ఆ బాబు వయసు 13 ఏళ్లు. తల్లితో నానమ్మ తరచూ గొడవపడుతుండటంతో క్షణికావేశంలో ఘోరానికి పాల్పడ్డాడు. కత్తితో నానమ్మను పొడిచాడు. జనగామ జిల్లాలోని జఫర్‌గఢ్‌ మండలంలోని ఉప్పుగల్లు గ్రామంలో ఈ ఘోరం జరిగింది. తీవ్ర రక్తసావ్రంతో ఆ వృద్ధురాలు ఆస్పత్రికి

13 ఏళ్ల అబ్బాయి.. నాన్నమ్మను పొడిచాడు

13 ఏళ్ల బాలుడి ఘాతుకం

తల్లితో తరచూ గొడవ పడుతోందనే..

ఛాతీలో తీవ్రగాయం.. రక్తస్రావం

ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి

జనగామ జిల్లాలో ఘటన

జఫర్‌గడ్‌, ఏప్రిల్‌ 14: ఆ బాబు వయసు 13 ఏళ్లు. తల్లితో నానమ్మ తరచూ గొడవపడుతుండటంతో క్షణికావేశంలో ఘోరానికి పాల్పడ్డాడు. కత్తితో నానమ్మను పొడిచాడు. జనగామ జిల్లాలోని జఫర్‌గఢ్‌ మండలంలోని ఉప్పుగల్లు గ్రామంలో ఈ ఘోరం జరిగింది. తీవ్ర రక్తసావ్రంతో ఆ వృద్ధురాలు ఆస్పత్రికి తరలిస్తుండగానే కన్నుమూసింది. ఉప్పుగల్లు గ్రామానికి చెందిన వృద్ధ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. కుమారుడు పదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి మృతుడి భార్య, తన ఇద్దరు కుమారులతో వృద్ధులైన అత్తామామల వద్దే ఉంటోంది. ఈ ఇంట్లోని వారు ఉన్న కొంత భూమిలో వ్యవసాయ పనులు చేసుకుంటూనే కూలీ పనులకు వెళుతున్నారు. కొన్నాళ్లుగా కుటుంబసమస్యలపై అత్త, కోడలి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి కూడా ఇద్దరూ పరస్పర దూషణలతో తీవ్రంగా గొడవపడ్డారు. ఇదంతా చూసిన వృద్ధురాలి చిన్న మనుమడు నానమ్మ మీద కోపంతో కత్తితో ఆమె ఛాతీపై పొడిచాడు. తీవ్రగాయంతో కుప్పకూలిన ఆమెను అదేరాత్రి హనుమకొండ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. మృతురాలి ఽభర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడు పరారీలో ఉన్నాడని తెలిపారు.

Updated Date - Apr 15 , 2024 | 03:35 AM