కోర్టు భవనాన్ని మంజూరు చేయాలి
ABN , Publish Date - Feb 27 , 2024 | 11:23 PM
కల్వకుర్తి పట్టణంలోని కోర్టు శిథిలా వస్థకు చేరిందని నూతన భవన నిర్మాణానికి సహకరించాలని కల్వకుర్తి బార్ అసోసియేషన్ సభ్యులు కలిశారు.
- హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన న్యాయవాదులు
కల్వకుర్తి, ఫిబ్రవరి 27 : కల్వకుర్తి పట్టణంలోని కోర్టు శిథిలా వస్థకు చేరిందని నూతన భవన నిర్మాణానికి సహకరించాలని కల్వకుర్తి బార్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. మంగళవారం హైదరాబాద్లో హైకోర్టు న్యాయమూర్తి విజయసేన్రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ కల్వకుర్తి కోర్టుకు నూతన భవన ఆవశ్యకతను వివరించారు. ఈ మధ్యలోనే జిల్లా నుంచి నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయని త్వరలోనే నిర్మాణానికి అనుమతులు ఇస్తామని న్యాయమూర్తి తెలిపారని బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవా దుల వి.లక్ష్మణశర్మ, వెంకట్గౌడ్, కృష్ణయ్య, మల్లెపలి జగన్, వెంకటేశ్, నాగరాజు, లక్ష్మణ్రాజు, జయంత్కుమార్, రాంగోపాల్, ప్రశాంత్, సత్యం, శ్రీను, రాజు పాల్గొన్నారు.