అభివృద్ధే ధ్యేయంగా కొనసాగుతున్న బీజేపీ పాలన
ABN , Publish Date - Feb 29 , 2024 | 11:06 PM
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పాలనలో దేశంలో వేగంగా అభివృద్ధి జరుగుతోందని బీజేపీ రాష్ట్ర కోశాఽధికారి శాంతకుమార్ అన్నారు.
- విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్
భూత్పూర్, ఫిబ్రవరి 29 : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పాలనలో దేశంలో వేగంగా అభివృద్ధి జరుగుతోందని బీజేపీ రాష్ట్ర కోశాఽధికారి శాంతకుమార్ అన్నారు. గురువారం భూత్పూర్కు వచ్చిన సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుదర్శన్రెడ్డి ఇంట్లో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 70 ఏళ్లుగా వెనుకబడ్డ భారతదేశాన్ని అభివృద్ధి పర్చాలన్న లక్ష్యంతో ప్రధాన మంత్రి ఎన్నికష్టాలు ఎదురైనా దేశ ప్రజల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మూడవ సారి భారత ప్రధానిగా నర్రేందమోదీ విజయభేరి మోగించనున్నారని శాంతకుమార్ ధీమా వ్యక్తం చేశారు. రామమందిర నిర్మాణం, జమ్మూకశ్మీర్కు వర్తించే 370 ఆర్టికల్ అధికరణ రద్దు, వంటి సాహసోపేత నిరర్ణయాలతో బీజేపీ ప్రభుత్వం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, కాంగ్రెస్ బీజేపీలకే పోటీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆరుగ్యారెంటీల ఆట అంతా ఉత్తదేనని, ఏదో అనాలోచితంగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంతో అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం మల్లగులాలుపడుతోందని ఆయన తేల్చి చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుదర్శన్రెడ్డి, ఎగ్గని నర్సిములు, రవీందర్రెడ్డి, పార్టీ మండల, పట్టణ అధ్యక్షుడు రవీందర్, మీడియా ఇన్చార్జి గొడుగు అంజన్న, నాయకులు పాల్గొన్నారు.
కందూరు రామలింగేశ్వరుని సన్నిధిలో..
అడ్డాకుల : మండల పరిధిలోని కందూరులో దక్షిణ కాశీగా వెలుగొందుతున్న కందూరు రామలింగేశ్వరస్వామిని గురువారం బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతకుమార్ దర్శించుకున్నారు. ఆయన వెంట ఎగ్గని నర్సింహులు, సుదర్శన్రెడ్డి, రమేశ్, ఆంజనేయులు, గట్టు మల్లేశ్, పాల్గొన్నారు.