Share News

అందరికీ న్యాయం జరిగేందుకే కుల గణన:పొన్నం

ABN , Publish Date - Oct 14 , 2024 | 05:31 AM

రాష్ట్రంలోని ప్రతి పౌరునికి న్యాయం జరిగేందుకే కుల గణన నిర్వహిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

అందరికీ న్యాయం జరిగేందుకే కుల గణన:పొన్నం

హుస్నాబాద్‌, అక్టోబరు 13: రాష్ట్రంలోని ప్రతి పౌరునికి న్యాయం జరిగేందుకే కుల గణన నిర్వహిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఈ ప్రక్రియను 60 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పార. శనివారం ఆయన హుస్నాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు సంబంధించి సర్వే చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే జీఓ 18 విడుదల చేసిందన్నారు. బీసీ కుల గణన పూర్తి అయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టులో వచ్చే వర్షాకాలంలోపు నీటిని నింపుతామని చెప్పారు.

Updated Date - Oct 14 , 2024 | 05:31 AM