మాజీ ఉపప్రధాని జగ్జీవన్కు సీఎం నివాళి
ABN , Publish Date - Apr 06 , 2024 | 03:33 AM
మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి.. శుక్రవారం తన నివాసంలో ఆయన
హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి.. శుక్రవారం తన నివాసంలో ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి శ్రీధర్బాబు, ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శి రోహిత్ చౌదరి, ఎమ్మెల్సీ మహే్షకుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.