పేద జనబాంధవుడు సీఎం రేవంతరెడ్డి
ABN , Publish Date - Feb 29 , 2024 | 12:33 AM
ముఖ్యమం త్రి రేవంతరెడ్డి పేద జ నబాంధవుడని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.
పేద జనబాంధవుడు సీఎం రేవంతరెడ్డి
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, ఫి బ్రవరి 28: ముఖ్యమం త్రి రేవంతరెడ్డి పేద జ నబాంధవుడని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నా రు. ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకం కింద రూ. 500కే సిలిండర్, గృహజ్యోతి పథకం ద్వా రా 200 యూనిట్ల ఉచి త విద్యుత పథకాలను ప్రారంభించిన సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆ ధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీఎల్ఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన రెండున్నర నెలల్లోనే 4 పథకాల ను అమలు చేసి ప్రజలపై తమకున్న నిబద్ధతను చాటుకున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరో రెండు గ్యారెంటీలను అమలు చేసి ప్రజలకు ఇచ్చిన వా గ్దానాన్ని నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణలో పదేళ్ల తర్వాత ఇప్పుడే ప్రజాపాలన ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అ ధ్యక్షుడు నూకల వేణుగోపాల్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్, త మ్మడబోయిన అర్జున, ఎంపీపీ నందినీరవితేజ, సునీత, కృష్ణయ్య, కౌన్సిలర్లు దేశి డి శేఖర్రెడ్డి, గంధం రామకృష్ణ, కొమ్ము నాగలక్ష్మి, పందిరి అనిత, గుంజ శ్రీనివా స్, ఎంపీటీసీలు సాయి, జగ్గారెడ్డి, చలపతిరావు, సిద్దూనాయక్, వెంకటేశగౌడ్, అంజిరెడ్డి, సురేందర్రెడ్డి, ఇంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.