Share News

Wyra: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు అవమానం.. ప్రజాభవన్‌లోకి నడుచుకుంటూ వెళ్లాలని సిబ్బంది సూచన

ABN , Publish Date - Mar 31 , 2024 | 12:01 PM

కాంగ్రెస్(Congress) వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోథ్ రాందాస్ నాయక్‌కు అవమానం జరిగింది. ఆయన ప్రజాభవన్‌(Praja Bhavan)లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆదివారం కలవాల్సి ఉండగా ఆయన హైదరాబాద్ వచ్చారు.

Wyra: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు అవమానం.. ప్రజాభవన్‌లోకి నడుచుకుంటూ వెళ్లాలని సిబ్బంది సూచన

హైదరాబాద్: కాంగ్రెస్(Congress) వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోథ్ రాందాస్ నాయక్‌కు అవమానం జరిగింది. ఆయన ప్రజాభవన్‌(Praja Bhavan)లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆదివారం కలవాల్సి ఉండగా ఆయన హైదరాబాద్ వచ్చారు.

ఆయన ప్రభుత్వం కేటాయించిన కారులో కాకుండా ఇతర కారులో ప్రజాభవన్ వద్దకు చేరుకున్నారు. గమనించిన ప్రజాభవన్ భద్రతా సిబ్బంది ఇతర వాహనాలకు లోపలికి అనుమతి లేదని చెబుతూ.. ఎమ్మెల్యే కారును ఆపేశారు.

KCR: రైతుల చెంతకు బయల్దేరిన కేసీఆర్.. ఫస్ట్ ఎక్కడికి వెళ్తారంటే

భట్టిని కలవాలంటే నడుచుకుంటూ వెళ్లాలని సిబ్బంది.. ఎమ్మెల్యేకు సూచించారు. దీంతో ఒకింత అసహనానికి గురయ్యారు. ఈ ఘటన పార్టీలో చర్చనీయాంశం అయింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 31 , 2024 | 12:03 PM